Shariff Mohammed Ahmed: క్రికెటర్ సిరాజ్‌కు జుబ్లీహిల్స్‌లో ఇంటిస్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు

Mohammed Siraj gets 600 sq yard plot in Jubilee Hills

  • టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సిరాజ్ సభ్యుడు
  • ఇటీవల సీఎంను కలిసిన మహమ్మద్ సిరాజ్
  • ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి
  • హైదరాబాద్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం

భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో సిరాజ్ సభ్యుడు. ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం సిరాజ్ కు హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది.

ఇటీవల టీ20 ప్రపంచకప్ సాధించిన తర్వాత నగరానికి చేరుకున్న సిరాజ్ జుబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రికి టీమిండియా జెర్సీని బహూకరించారు. 

ఈ సందర్భంగా సిరాజ్‌కు ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం, తాజాగా ఇంటిస్థలం కేటాయిస్తూ జీవో జారీ చేశారు.

  • Loading...

More Telugu News