Vandebharat: విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు షెడ్యూలులో మార్పు

Visakha Secunderabad Vandebharat train Schedule changed

 


విశాఖ-సికింద్రాబాద్ నగరాల మధ్య నడిచే సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలు షెడ్యూల్ లో మార్పు చోటుచేసుకుంది. విశాఖ-వందేభారత్ రైలుకు ప్రతి మంగళవారం విరామం ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబరు 10 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు ఆదివారం మినహా వారంలోని అన్ని రోజులు నడుస్తోంది. 

విశాఖ-సికింద్రాబాద్ మధ్య రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూట్లో ఇప్పటికే పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నప్పటికీ, రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో వందేభారత్ రైలును కూడా కేంద్రం ఈ ఏడాది మార్చి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది.

  • Loading...

More Telugu News