Love: భార్యకు ఆమె బాల్యస్నేహితుడితో పెళ్లి జరిపించిన భర్త

A Husband shows big heart in Bihar

  • బీహార్ లో విస్మయం కలిగించే ఘటన
  • భార్య ప్రేమను గెలిపించిన భర్త
  • భార్య ప్రేమ కోసం తన వైవాహిక జీవితాన్ని త్యాగం చేసిన వైనం 

బీహార్ లో ఓ భర్త ఎవరూ చేయని రీతిలో భార్యకు ఆమె బాల్యస్నేహితుడితో పెళ్లి జరిపించాడు. భార్య ప్రేమను గెలిపించడానికి తన దాంపత్య జీవితాన్ని త్యాగం చేశాడు. కోరుకున్న వ్యక్తితో హాయిగా జీవించు అంటూ భార్యను దీవించి పంపాడు. 

బీహార్ లోని లక్షిసరాయ్ జిల్లా రామ్ నగర్ గ్రామానికి చెందిన కుష్బూ కుమారి (22), రాజేశ్ కుమార్ (26) భార్యాభర్తలు. వారికి 2021లో పెళ్లయింది. అయితే కుష్బూ కుమారికి పెళ్లికి ముందే ఓ ప్రేమ వ్యవహారం ఉంది. చిన్ననాటి స్నేహితుడు చందన్ కుమార్ (24)తో ప్రేమ వ్యవహారాన్ని కుష్బూ కుమారి తన పెళ్లయిన తర్వాత కూడా కొనసాగించింది. 

అయితే చందన్ కుమార్ తన ప్రేయసి కుష్బూ కుమారిని కలిసేందుకు రామ్ నగర్ గ్రామానికి రాగా... కుష్బూ కుమారి అత్తింటివారు ఈ విషయాన్ని పసిగట్టారు. కుష్బూ కుమారి, చందన్ కుమార్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

కుష్బూ కుమారి భర్త రాజేశ్ కుమార్ ఎంతో పెద్ద మనసుతో వ్యవహరించి... భార్యకు నచ్చిన చందన్ కుమార్ తో ఆమె పెళ్లి జరిపించాడు. స్థానికంగా ఓ గుడిలో పెళ్లి తంతు జరిపించి, వారిని మనస్ఫూర్తిగా సాగనంపాడు. తన భార్య కుష్బూ కుమారి సంతోషంగా ఉండడమే తాను కోరుకుంటానని వెల్లడించాడు. 

రాజేశ్ కుమార్ మంచితనం పట్ల కుష్బూ కుమారి కదిలిపోయింది. తాను, చందన్ కుమార్ ప్రేమించుకున్న విషయం భర్త రాజేశ్ కుమార్ కు తెలుసని, తామిద్దరం పట్టుబడిన తర్వాత అతడు మరేమీ ఆలోచించకుండా పెళ్లికి అంగీకరించాడని వెల్లడించింది. రాజేశ్ కుమార్ కు రుణపడి ఉంటానని తెలిపింది. 

కాగా, కుష్బూ కుమారి, రాజేశ్ కుమార్ లకు రెండేళ్ల కొడుకు ఆయుష్ ఉన్నాడు. ఆయుష్ ను కుష్బూ కుమారితో పంపించలేమని, ఆ చిన్నారి తమ ఆనందాలకు నెలవు అంటూ రాజేశ్ కుమార్ తల్లి పేర్కొంది.

  • Loading...

More Telugu News