Damodara Raja Narasimha: సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం: దామోదర రాజనర్సింహ

Damodara praises CM Revanth Reddy

  • ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్న దామోదర
  • సుప్రీంకోర్టు తీర్పును సీఎం అమలు చేస్తామని చెప్పారని హర్షం
  • ఈ నెల 16న లేదా 17న మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని వెల్లడి
  • ఈ సమ్మేళనానికి సీఎంను ముఖ్య అతిథిగా పిలుస్తామన్న దామోదర

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని, ఈ తీర్పును అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సుప్రీంకోర్టు తీర్పును సీఎం అమలు చేస్తామని చెప్పారని హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 16న లేదా 17న మాదిగల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమ్మేళనానికి సీఎంను ముఖ్య అతిథిగా పిలుస్తామన్నారు.

  • Loading...

More Telugu News