Bomb Threat: స్కూల్‌కి వెళ్లే మూడ్ లేక పాఠశాలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ పంపిన బాలుడు

14 year old sent emails to several schools as he was not in the mood to attend the school


శుక్రవారం ఢిల్లీలోని ఓ ప్రైవేటు పాఠశాల సహా మొత్తం మూడు స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్‌ వ్యవహారానికి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడిని అనుమానితుడిగా గుర్తించామని చెప్పారు. స్కూల్‌కు వెళ్లే మూడ్ లేక బాలుడు ఈ పని చేశాడని వివరించారు. దర్యాప్తులో బాలుడు ఈ విషయాలను ఒప్పుకున్నాడని వివరించారు. తాను పంపిన ఈ-మెయిల్ నమ్మదగినదిగా ఉండేందుకు మరో రెండు స్కూళ్లకు కూడా మెయిల్స్ పంపించినట్టు ఒప్పుకున్నాడని వివరించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  

కాగా శుక్రవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ పాఠశాలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో స్కూల్ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రమాదం లేదని తేల్చారు. అర్ధరాత్రి సమయంలో పాఠశాలకు మెయిల్ వచ్చిందని, పాఠశాల ఆవరణలో బాంబు పెట్టినట్లు ఈ-మెయిల్‌లో పేర్కొన్నారని అధికారులు పేర్కొన్నారు. బాంబు స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏమీ లేదని తేల్చిందని వివరించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News