Chandrababu: మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి.. చంద్రబాబు అభినందనలు

CM Chandrababu congratulated the young lady of Kuppam for her rare recognition

  • మిస్ యూనివర్స్ – ఇండియాకు అర్హత సాధించిన కుప్పం యువతి
  • కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబును కలిసిన చందన
  • అభినందించిన ముఖ్యమంత్రి

కుప్పం నియోజకవర్గంలోని ఎంకే పురానికి చెందిన యువతి చందన జయరాం అరుదైన గుర్తింపు సాధించారు. మిస్ యూనివర్స్–ఇండియాకు ఏపీ నుంచి చందన జయరాం అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో చందన మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుంచి ఎంపిక అయ్యారు.
 
ముంబై‌లో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో చందన పాల్గొననున్నారు. తన నియోజకవర్గం కుప్పం నుంచి మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు చందన అర్హత సాధించడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News