Women Harassed: రెచ్చిపోయిన పోకిరీలు.. భర్తతో బైక్‌పై వెళుతున్న మహిళకు వేధింపులు.. వీడియో ఇదిగో!

video shows people mistreating a woman during rain and causing a ruckus under the Taj Hotel bridge

  • ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘటన
  • వరద నీరు నిలిచిన రోడ్డు మీద బైక్‌‌పై వెళుతున్న దంపతులకు దారుణ అనుభవం
  • దంపతులను చుట్టుముట్టి ఆకతాయిల వేధింపులు
  • మహిళపై రోడ్డుమీదున్న నీటిని దోసిళ్లతో ఎత్తిపోసి వికృతానందం

ఉత్తరప్రదేశ్‌లో లక్నోలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భారీగా వరద నీరు నిలిచిన స్థానిక తాజ్ హోటల్ బ్రిడ్జి మీద భర్తతో కలిసి బైక్‌పై వెళుతున్న ఓ మహిళను కొందరు ఆకతాయిలు దారుణంగా వేధించారు. రోడ్డు మీదున్న వరద నీటిని దోసిళ్లతో ఎత్తి ఆమెపై పోస్తూ రాక్షసానందం పొందారు. ఈ వికృత చర్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమెను కొందరు వెనక నుంచి అసభ్యంగా తాకి ఇబ్బంది పెట్టారు. నీటిలో బైక్ నడపలేక వ్యక్తి ఇబ్బంది పడుతుంటే కొందరు వాహనాన్ని వెనక్కులాగి ఆ దంపతులు కింద పడిపోయేలా చేశారు. అయితే, పోలీసులు వెంటనే కలగజేసుకుని అల్లరి మూకలను చెదరగొట్టారు. 

ఈ ఉదంతం నెట్టింట పెనుకలకలానికి దారి తీసింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ మహిళపై ఆమె భర్త ముందే అల్లరి మూకలు రెచ్చిపోయిన తీరు అనేక మందిని ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News