Living in Garbage: ఇంట్లో నాలుగు వేల కిలోల చెత్త మధ్య తల్లీకూతుళ్ల జీవనం... వివరాలు ఇవిగో!

Mother and daughter lives amid 4 tonne garbage

  • తమిళనాడులో విస్తుగొలిపే ఘటన
  • భర్త మరణంతో మానసికంగా కుంగిపోయిన మహిళ
  • కుమార్తెతో కలిసి నాలుగ్గోడల మధ్యే జీవనం
  • ఆన్ లైన్ ద్వారా ఫుడ్ తెప్పించుకుంటున్న తల్లీకూతుళ్లు
  • ఇంట్లో పేరుకుపోయిన 4 టన్నుల చెత్త

తమిళనాడులో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన దిగ్భ్రాంతి కలిగించేలా ఉంది. ఇంట్లో 4 వేల కిలోల చెత్త మధ్య తల్లీకూతుళ్లు జీవిస్తున్న వైనం విస్తుగొలుపుతోంది. 

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... కోయంబత్తూరులోని ఓ అపార్ట్ మెంట్ లో రుక్మిణి అనే మహిళ, ఆమె భర్త, కుమార్తె నివసించేవారు. రుక్మిణి భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. భర్త మరణించడంతో రుక్మిణి, కుమార్తె మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు. 

భర్త మరణించిన తర్వాత బంధువులు ఎవరూ రాలేదు. దాంతో మానసికంగా కుంగిపోయిన రుక్మిణి, ఆమె కుమార్తె ఇంటి నుంచి బయటికి రావడం మానేశారు. భర్త మరణించడంతో రుక్మిణికి పెన్షన్ వచ్చేది. అదే వారికి ఆధారం. 

ప్రతిరోజు ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకునేవారు. ఎప్పుడో ఒకసారి వంట చేసుకునేవారు. అయితే, వ్యర్థాలను పారేయకుండా అలాగే వదిలేయడంతో ఇల్లంతా చెత్త మయం అయిపోయింది. ఇంటిని శుభ్రపరిచేవారు కాదు. దాంతో, దాదాపు 4 టన్నుల చెత్త ఇంటి నిండా పేరుకుపోయింది. 

అయితే, ఇరుగుపొరుగు వారు ఈ విషయాన్ని గుర్తించి ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఎంతో ప్రయత్నించిన మీదట రుక్మిణి ఇంట్లోకి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ప్రవేశించగలిగారు. ఒక్కసారిగా తట్టుకోలేనంత తీవ్ర దుర్గంధంతో వారు ఉక్కిరిబిక్కిరయ్యారు. డంపింగ్ యార్డ్ లా కనిపిస్తున్న ఆ ఇంటిని చూసి నివ్వెరపోయారు. 

ఆ ఇంటి లోపలి దృశ్యాలను ఫోన్ లో వీడియో రికార్డ్ చేసిన స్వచ్ఛంద సంస్థ వారు, ఆ విజువల్స్ ను మున్సిపల్ అధికారులకు పంపించారు. దాంతో, స్పందించిన మున్సిపల్ అధికారులు తమ సిబ్బందిని పంపించి, రుక్మిణి ఇంట్లోని 4 వేల కిలోల చెత్తను బయటికి తరలించి, ఇంటిని శుభ్రం చేయించారు.

  • Loading...

More Telugu News