Chandrababu: నెల్లూరు రొట్టెల పండుగకు రూ.5 కోట్లు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు

Chandrababu issued Rs 5 crore to Nellore Roti Festival

  • ఈ నెల 17న ప్రారంభమైన నెల్లూరు రొట్టెల పండుగ
  • నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువులో ఘనంగా రొట్టెల పండుగ
  • భక్తులకు శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు

ఏపీలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లోనూ ఎంతో ప్రసిద్ధికెక్కిన నెల్లూరు రొట్టెల పండుగ ఈ నెల 17న ఘనంగా ప్రారంభమైంది. నెల్లూరు బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువులో ఈ వేడుక ఐదు రోజుల పాటు జరగనుంది. మతాలకు అతీతంగా భక్తులు ఈ పండుగలో పాలుపంచుకుంటారు. కాగా, నెల్లూరు రొట్టెల పండుగకు ఏపీ సీఎం చంద్రబాబు రూ.5 కోట్లు మంజూరు చేశారు. రొట్టెల పండుగ నేపథ్యంలో భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు రొట్టెల పండుగను 2014లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.

  • Loading...

More Telugu News