TDP Tweet: 'ఏం జరిగినా ముందు టీడీపీ మీద తోసేయడమే..' అంటూ మండిపడిన టీడీపీ!

TDP Reaction On Vinukonda Murder Allegations

  • వినుకొండ మర్డర్ పై టీడీపీ రియాక్షన్
  • హతుడు, హంతకుడు ఇద్దరూ వైసీపీ కార్యకర్తలేనని వివరణ
  • వినుకొండ వైసీపీ నేత పీఎస్ ఖాన్ అనుచరులేనని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా ముందు టీడీపీ మీద తోసేయడమే పనిగా పెట్టుకుందని వైసీపీ పార్టీపై అధికార పార్టీ మండిపడింది. వినుకొండలో బుధవారం జరిగిన వైసీపీ కార్యకర్త రషీద్ హత్యపై ట్విట్టర్ లో స్పందించింది. ‘పొద్దున్నే 3 గంటలకు ఫోన్ చేసి బాబాయ్‌ని లేపించి, చంద్రబాబు చంపాడని పేపర్ లో వేసిన నీచ చరిత్ర వీళ్ళది.. ఏది జరిగినా, ముందు టీడీపీ మీద తోసేయటమే’ అంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది.

బుధవారం జరిగిన దారుణ హత్యలో చనిపోయిన రషీద్, చంపిన షేక్ జిలానీ.. ఇద్దరూ వైసీపీ కార్యకర్తలేనని ట్వీట్ లో పేర్కొంది. ఇద్దరూ వైసీపీ నేత, స్థానిక రౌడీగా పేరొందిన పీఎస్ ఖాన్ కు ప్రధాన అనుచరులేనని వెల్లడించింది. సదరు పీఎస్ ఖాన్ వైసీపీ చీఫ్ జగన్ కు ప్రధాన అనుచరుడని వివరించింది. అయితే, తప్పు ఎవరు చేసినా తప్పేనని, తప్పు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. గడిచిన ఐదేళ్లలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయిన వైసీపీ సైకోలకు పట్టిన మదం దించి, వారు చేసే దారుణాలను ఆపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో గంజాయిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News