Etela Rajender: కేసీఆర్ కు విశ్వసనీయత లేదు.. ఏమైనా చేయొచ్చని రేవంత్ భావిస్తున్నారు: ఈటల రాజేందర్

Etela Rajender fires on Revanth Reddy and KCR

  • అడ్డదారులు తొక్కి కాంగ్రెస్ గెలిచిందన్న ఈటల
  • రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయని విమర్శ
  • రుణమాఫీకి, రేషన్ కార్డుకు లింక్ పెట్టడం దారుణమని వ్యాఖ్య

అడ్డదారులు తొక్కి, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని... ఇప్పుడు రుణమాఫీకి తెల్ల రేషన్ కార్డు ఉండాలనే నిబంధన పెట్టారని విమర్శించారు. రైతు రుణమాఫీకి 6 పేజీల నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. రుణమాఫీ నిబంధనలు రైతులకు ఉరితాడుగా మారాయని చెప్పారు. రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుని 7 నెలలైనా ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ విశ్వసనీయత లేని నాయకుడని.. అందుకే ఆయనకు ప్రజలు బొంద పెట్టారని అన్నారు. కేసీఆర్ ను ఓడించాలని కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని చెప్పారు.

  • Loading...

More Telugu News