పూరి ‘రత్న భాండాగారం’లో పాములు కనిపించాయా?.. లోపలికి వెళ్లిన హైకోర్ట్ జడ్జి ఆసక్తికర వ్యాఖ్యలు
- పాములు కాపలా ఉన్నాయనే ప్రచారాన్ని ఖండించిన జడ్జి బిశ్వనాథ్ రాత్
- రత్న భాండాగారం చుట్టూ అనేక అపోహలు ఉన్నాయని వ్యాఖ్య
- ఆయన పర్యవేక్షణలోనే భాండాగారం మూడవ గది తలుపులు తెరచిన ప్రత్యేక బృందం
11 మంది సభ్యుల బృందం తాళాలు కత్తిరించి లోపలికి ప్రవేశించిందని చెప్పారు. రత్న భాండాగారంలోని ఆభరణాల సంపదను పరిశీలించిన అనంతరం ఆయన ఈ మేరకు ఆదివారం మీడియాకు వివరించారు. భాండాగారం మరింత తనిఖీ చేసేందుకు, ఆభరణాలను మార్చడానికి ఎక్కువ సమయం దక్కలేదని, అందుకే దేవత ఆభరణాలు, విలువైన రాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు మరొక తేదీని నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. కాగా పొద్దుపోవడంతో ఆభరణాల విలువ లెక్కింపును కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే.