Telangana: రాయదుర్గంలో టీ-స్క్వేర్ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించిన టీజీఐఐసీ

Tender for T square at Rayadurgam

  • ప్రజలకు అందుబాటులో ఉండేలా టీ-స్క్వేర్‌ను నిర్మాణం
  • స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉండాలని నిర్ణయం
  • అర్హులైన కాంట్రాక్టర్ల ఎంపికకు టీజీఐఐసీ కసరత్తు

రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో టీ-స్క్వేర్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిశ్రమ మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో టీ-స్క్వేర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు టీజీఐఐసీ టెండర్లను ఆహ్వానించింది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా టీ-స్క్వేర్‌ను నిర్మించనున్నారు. అలాగే, స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా నిర్మాణం ఉండాలని నిర్ణయించారు.

రోజూవారీ పనులతో తీరిక లేకుండా గడిపే వారికి టీ-స్క్వేర్‌లో జరిగే ఈవెంట్లతో ఆహ్లాద వాతావరణం కల్పించాలని భావిస్తున్నారు. ఇక్కడ టీజీఐఐసీ భారీ ప్లాజాను నిర్మించనుంది. ఈ మేరకు అర్హులైన కాంట్రాక్టర్లను ఎంపిక చేసేందుకు టీజీఐఐసీ కసరత్తు చేస్తోంది.

  • Loading...

More Telugu News