Jammu And Kashmir: బిడ్డలకు తాను తండ్రిని కాదన్న భర్త.. నవజాత కవలలను గొంతుకోసి చంపిన తల్లి

Woman Slits Throats Of Newborn Twins After Husband Says Hes Not The Father

  • జమ్మూకశ్మీర్‌లో ఘటన
  • భర్త సౌదీ నుంచి వచ్చిన మూడు నెలలకే మహిళ ప్రసవం
  • వారు తన సంతానం కాదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు
  • సమస్య తప్పదన్న భయంతో కన్నబిడ్డలను కడతేర్చిన మహిళ

నవజాత కవలలను కన్నతల్లి గొంతు కోసి చంపిన దారుణ ఘటన జమ్మూకశ్మీర్‌లో తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పూంచ్ జిల్లాకు చెందిన ఓ మహిళ భర్త చాలా కాలం పాటు సౌదీ అరేబియాలో గడిపి, మూడు నెలల క్రితమే ఇంటికి తిరిగొచ్చాడు. ఆ తరువాత కొన్ని రోజులకే ఆ మహిళ ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది.

 దీంతో, ఆ బిడ్డలు తన సంతానం కాదంటూ భర్త పోలీసులను ఆశ్రయించాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని ఆరోపించాడు. దీంతో, తనకు సమస్యలు తప్పవని భావించిన మహిళ నవజాత శిశువులను సమీపంలోని పొలంలోకి తీసుకెళ్లి గొంతు కోసి చంపేసింది.

ఈ దారుణానికి మహిళ భర్త కారణమని స్థానికులు ముందుగా భావించినా, పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళను పోలీసులను ప్రశ్నించగా, ఆమె చివరకు చేసిన నేరాన్ని అంగీకరించింది. దీంతో, పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News