Anakapalli Girl Murder: మైనర్ బాలిక హత్య కేసులో ట్విస్ట్.. నిందితుడి ఆత్మహత్య

Anakapalli girl murderer suicide

  • నాలుగు రోజులుగా సురేశ్ కోసం గాలిస్తున్న పోలీసులు
  • కొప్పుగుండుపాలెంలో సురేశ్ మృతదేహం లభ్యం
  • కుళ్లిపోతున్న స్థితిలో మృతదేహం

అనకాపల్లిలో మైనర్ బాలిక హత్య ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, బాలికను హత్య చేసిన నిందితుడు సురేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో సురేశ్ మృతదేహం లభ్యమయింది. అక్కడి పరిసరాల్లో లభించిన ఆధారాల ప్రకారం అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోతున్న స్థితిలో ఉంది. 

నిందితుడి కోసం నాలుగు రోజులుగా 12 బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల నగదు బహుమతిని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. సురేశ్ విశాఖపట్నం జైల్లో ఉన్నప్పుడు ఎవరితో పరిచయాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News