Vijayalaxmi: అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఫిర్యాదు

GHMC mayor complaints in CCS police

  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మేయర్
  • సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆవేదన
  • మంత్రి పొన్నంతో పాటు తనను కూడా ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదు

తనపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదును అందించారు. తనను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు తనను కూడా ట్రోల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News