Chandrababu: ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు... రేపు ఉదయం ప్రధానితో భేటీ

Chandrababu to meet PM Modi tomorrow

  • రేపు ఉదయం 10.15కు ప్రధానితో భేటీ కానున్న చంద్రబాబు
  • ఏపీకి ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించనున్న ఏపీ సీఎం
  • అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లతోనూ భేటీ

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 10.15 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. పోలవరం, అమరావతి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి నివేదిక ఇవ్వనున్నారు.

ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం

చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర పునర్నిర్మాణానికి దోహదపడే అంశాలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. రాష్ట్రాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్తామనే ఉద్దేశంతోనే ప్రజలు తమ కూటమికి 164 సీట్లు ఇచ్చారన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం అందరి బాధ్యత అన్నారు.

  • Loading...

More Telugu News