Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడి... ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు స్పీకర్ నోటీసులు

Speaker Om Birla summons Delhi Commissioner over Asad house attacked
  • ఢిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ నివాసంపై దాడి
  • ఘటనపై లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన హైదరాబాద్ ఎంపీ
  • ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సమన్లు జారీ చేసిన ఓం బిర్లా

హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని ఆయన నివాసంపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటనకు సంబంధించి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సమన్లు జారీ చేశారు. లోక్ సభలో ఎంపీగా ప్రమాణం చేసిన సమయంలో జై పాలస్తీనా అని నినదించడంతో అసదుద్దీన్ ఒవైసీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ క్రమంలో, గత రాత్రి ఆయన నివాసంపై ఆగంతుకులు దాడి చేశారు. ఈ ఘటనపై లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లాను కలిసి ఒవైసీ వివరించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యంత భద్రత జోన్‌గా పరిగణించే ఈ ప్రాంతంలో దాడి జరగడంతో ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News