Ramoji Rao: విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Chandrababu and Pawan Kalyan attends Ramoji Rao memorial service in Vijayawada
  • ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన రామోజీరావు
  • ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నేడు విజయవాడలో సంస్మరణ సభ
  • సతీసమేతంగా హాజరైన చంద్రబాబు
  • కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ మంత్రులు లోకేశ్, నాదెండ్ల, పార్థసారథి, సత్యకుమార్

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కొన్నిరోజుల కిందట తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం నేడు విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు చేసింది. 

ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా హాజరయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రామోజీరావు ప్రస్థానం ఛాయాచిత్రాల ప్రదర్శనను తిలకించారు. వారాహి మాత దీక్షలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. 

రామోజీరావు కుటుంబ సభ్యులు ప్రత్యేక బస్సులో రాగా, వారికి ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి స్వాగతం పలికారు. ఏపీ మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ కూడా రామోజీ సంస్మరణకు వచ్చారు. ఆ పాత్రికేయ దిగ్గజం చిత్రపటానికి నివాళులు అర్పించారు  సీనియర్ నటులు మురళీమోహన్, జయసుధ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News