Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో అమానుష చ‌ర్య‌.. కావాల‌ని కారు ఎక్కించి లేగ‌దూడ‌ను చంపిన వ్య‌క్తి.. వీడియో వైర‌ల్‌!

Man Intentionally Crushes Innocent Calf With Car In Chhattisgarh

  • ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఘ‌ట‌న‌
  • రోడ్డుపై ఉన్న ఆవుల ప‌ట్ల రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తి
  • రోడ్డుపై పడుకున్న లేగ‌దూడ‌పైకి కావాల‌నే కారు ఎక్కించిన వైనం
  • త‌న బిడ్డ‌ను ర‌క్షించుకునేందుకు త‌ల్ల‌డిల్లిపోయిన త‌ల్లి ఆవు  
  • సీసీటీవీ కెమెరాలో రికార్డ‌యిన దృశ్యాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగిన అమానుష‌ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రోడ్డుపై ఉన్న ఆవుల ప‌ట్ల ఓ వ్య‌క్తి  రాక్ష‌సంగా ప్ర‌వ‌ర్తించ‌డం వీడియోలో ఉంది. రోడ్డుపై పడుకున్న లేగ‌దూడ‌పైకి అత‌డు కావాల‌నే తన హ్యుందాయ్ కారును ఎక్కించాడు. అంతేగాక రివ‌ర్స్ గేర్‌లో మ‌రోసారి దానిపైకి కారును తీసుకెళ్ల‌డంతో లేగ‌దూడ చ‌నిపోయింది. 

త‌న బిడ్డ‌ను ర‌క్షించుకునేందుకు ఆ త‌ల్లి ఆవు త‌ల్ల‌డిల్లిపోయిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అలాగే అక్క‌డ ఉన్న 7 నుంచి 8 ఆవులు మార్గమధ్యంలో చనిపోయి పడి ఉన్న దూడ దగ్గరికి పరుగెత్తడం కూడా వీడియోలో ఉంది. ఇక వీడియోను ఛత్తీస్‌గఢ్ సుదర్శన్ ఛానెల్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. దీంతో వీడియో చూసిన నెటిజ‌న్లు స‌ద‌రు వ్య‌క్తిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.  

కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు నంబర్‌ను తెలుసుకుని, ఆ వివరాల ఆధారంగా కారు యజమానిని షేక్ షాహిద్ గా గుర్తించారు. ఘటనకు కారణమైన కారు డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక హిందూ సంఘాలు కోరాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News