విరాట్ కోహ్లీ వైఫల్యంపై సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- క్రీజ్ బయటకు వస్తే బ్యాలెన్స్తో ఆడాలన్న మాజీ దిగ్గజం
- ఔట్ అయిన షాట్లను గమనిస్తే బ్యాలెన్స్ లేదని స్పష్టమవుతోందని విశ్లేషణ
- టీ20 వరల్డ్ కప్లో దారుణంగా విఫలమవుతున్న విరాట్
- ఆరు మ్యాచ్ల్లో వరుసగా 1, 4, 0, 24, 37, 0 చొప్పున పరుగులు
విరాట్ కోహ్లీ క్రీజ్ బయటకు వచ్చి ఆడేటప్పుడు అతడి బ్యాలెన్స్ మరింత మెరుగవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అతడు ఔట్ అయిన షాట్లను గమనిస్తే ఇది స్పష్టమవుతోందని అన్నారు. ఆంటిగ్వాలో బంగ్లాదేశ్పై మ్యాచ్లో కోహ్లీ బ్యాలెన్స్ సరిగ్గా లేదని అన్నారు. ఔట్ షాట్లలో అతడి బ్యాలెన్స్ బాగోలేదని అన్నారు. కోహ్లీ పిచ్పై మరింత సమయం గడిపితే అతడి విశ్వాసం మరింత పెరుగుతుందని సునీల్ గవాస్కర్ సూచించారు. ఇండియా వర్సెస్ ఆసీస్ మ్యాచ్కు ముందు స్టార్ స్పోర్ట్స్లో ఈ మేరకు గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్పై మ్యాచ్లో 37 పరుగులతో క్రీజులో సెట్ అయినట్టే కనిపించాడని, కానీ టాంజిమ్ హసన్ సాకిబ్ వేసిన స్లో డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడని గవాస్కర్ ప్రస్తావించారు. క్రీజ్ బయటకు వచ్చి ఆడాలని కోహ్లీ భావించాడని, బ్యాలెన్స్ లేక ఔట్ అయ్యాడని విశ్లేషించారు.