Eepurupalem: బాపట్ల జిల్లా అత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు

Police busted Eepurupalem case

  • ఈపూరుపాలెంలో యువతిపై అత్యాచారం, హత్య
  • నిన్న రైలు పట్టాల పక్కన మృతదేహం
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
  • ఘటన స్థలానికి వెళ్లి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో రైలు పట్టాల పక్కన ఓ యువతి మృతదేహం పడి ఉండడం నిన్న కలకలం రేపింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి ఉంటారని భావించారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, వెంటనే సంఘటన స్థలానికి వెళ్లాలని హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు.

కాగా, ఈ కేసును పోలీసులు ఛేదించారు. దీనిపై బాపట్ల జిల్లా ఎస్పీ వకుళ్ జిందాల్ స్పందించారు. ఈ ఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. నిందితులు ముగ్గురూ ఈపూరుపాలెంకు చెందినవారేనని తెలిపారు. మద్యం మత్తులో ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టు చెప్పారని ఎస్పీ వివరించారు.

  • Loading...

More Telugu News