Team India: మెరిసిన పాండ్యా... టీమిండియా భారీ స్కోరు

Team India scores 196 runs for 5 wickets against Bangladesh

  • టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ×  బంగ్లాదేశ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసిన టీమిండియా
  • హార్దిక్ పాండ్యా 50 నాటౌట్
  • రాణించిన రోహిత్, కోహ్లీ, పంత్, దూబే

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో బంగ్లాదేశ్ తో గ్రూప్-1 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. ఫామ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా మరోసారి రాణించిన వేళ... టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. పాండ్యా 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోగా... టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 11 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్ తో 23 పరుగులు చేయగా... కోహ్లీ 28 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 37 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 36 పరుగులు సాధించాడు. 

సూర్యకుమార్ యాదవ్ (6) విఫలం కాగా... శివమ్ దూబే 24 బంతుల్లో 3 సిక్సులతో 34 పరుగులు నమోదు చేశాడు. పాండ్యా, దూబే దూకుడుగా ఆడడంతో చివరి 5 ఓవర్లలో టీమిండియాకు 62 పరుగులు లభించాయి. బంగ్లాదేశ్ బౌలర్లలో టాంజిమ్ హసన్ సకీబ్ 2, రిషాద్ హుస్సేన్ 2, షకీబ్ అల్ హసన్ 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News