Nirmala Sitharaman: రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఉంటుంది: నిర్మలా సీతారామన్

FM Sitharaman underlines Centre support to states via timely tax devolution
  • ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆర్థికమంత్రులతో సమావేశం
  • సంస్కరణల కోసం 50 ఏళ్ల వడ్డీరహిత రుణాలను వినియోగించుకోవాలని సూచన
  • షరతులకు లోబడి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఆర్థికమంత్రి

రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం మద్దతు ఎప్పుడూ ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సకాలంలో జీఎస్టీ బకాయిల చెల్లింపు, పన్నుల పంపిణీ ద్వారా రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామన్నారు.

వివిధ సంస్కరణల కోసం కేంద్రం అందిస్తున్న 50 ఏళ్ల వడ్డీరహిత రుణాలను అన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలని సూచించారు. అయితే ఈ పథకం ద్వారా అందిన మొత్తాన్ని పౌర కేంద్రీకృత ప్రాజెక్టుల కోసం వినియోగించవలసి ఉంటుందన్నారు. ఈ షరతులకు లోబడి ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చునని సూచించారు. కరోనా అనంతరం రాష్ట్రాల మూలధన వ్యయాలను పెంచే లక్ష్యంతో కేంద్రం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట వడ్డీలేని రుణాలను తీసుకువచ్చింది. 2024-2025 బడ్జెట్ రూపకల్పనపై ఆర్థికమంత్రుల సలహాలు, సూచనలను నిర్మలమ్మ తీసుకున్నారు. బడ్జెట్‌కు సంబంధించి మంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

  • Loading...

More Telugu News