Uttar Pradesh: ఇంతకంటే ఘోరం ఉంటుందా... ఇది ఉన్మాదానికి వేరే లెవల్!

Most perverted incident happens in Uttar Pradesh

  • సన్నిహితంగా ఉంటున్న యువకుడిపై మోజు పడిన వ్యక్తి
  • యువకుడికి తెలియకుండా, తెలివిగా లింగ మార్పిడి చేయించిన వైనం
  • నువ్వు ఇప్పుడు అమ్మాయివి... నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ బెదిరింపులు
  • ఉత్తరప్రదేశ్ లో ఘోరం

ఆలోచనలు వెర్రితలలు వేస్తే అది విపరీత ధోరణి అనుకుంటాం. కానీ ఆ స్థాయిని కూడా దాటిపోతే దాన్ని ఏమనాలి? ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి! తనతో సన్నిహితంగా ఉంటున్న యువకుడిపై మోజు పడిన వ్యక్తి... ఆ యువకుడికి తెలియకుండానే లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించిన ఘటన గురించి వింటే ఒళ్లు గగుర్పొడుస్తోంది.

ముజఫర్ నగర్ కు చెందిన 20 ఏళ్ల ముజాహిద్ అనే యువకుడు... ఓం ప్రకాశ్ అనే వ్యక్తితో రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఇటీవల యువకుడు అనారోగ్యానికి గురికాగా... తాను ఆసుపత్రికి తీసుకెళతానంటూ ఓం ప్రకాశ్ ఆ యువకుడిని మన్సూర్ పూర్ లోని ఓ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడి డాక్టర్లు ముజాహిద్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఓ శస్త్రచికిత్స చేయాలని సూచించారు. నిజమేనని నమ్మిన యువకుడు శస్త్రచికిత్సకు సిద్ధమయ్యాడు. 

అయితే, వైద్యులు ముజాహిద్ కు లింగ మార్పిడి చేశారు. మత్తుమందు కారణంగా తనకు ఎలాంటి శస్త్రచికిత్స నిర్వహించారో ఆ యువకుడు గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత ఓం ప్రకాశ్ వచ్చి... ఇప్పుడు నువ్వు అమ్మాయిగా మారిపోయావు... నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను... జీవితాంతం మనం కలిసే ఉండొచ్చు అని చెప్పాడు. 

దాంతో దిగ్భ్రాంతికి గురైన ఆ యువకుడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఓం ప్రకాశ్ ను అరెస్ట్ చేశారు. 

కాగా, పెళ్లికి ఒప్పుకోకపోతే తన తండ్రిని చంపేస్తానంటూ ఓం ప్రకాశ్ బెదిరించాడని, తమ భూమిని కూడా లాక్కున్నాడని బాధిత యువకుడు ఆరోపించాడు. 

ఈ ఘటనపై భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. నిందితుడు ఓం ప్రకాశ్ తో పాటు, లింగ మార్పిడి చేసిన బేగ్ రాజ్ పూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి డాక్టర్లను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ బాధాకరమైన ఘటనతో యువకుడు శారీరకంగా, మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నాడని, అతడికి రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని కిసాన్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News