Pawan Kalyan: ప్రమాణ స్వీకారం చేశాక వచ్చి రామోజీరావును కలుద్దామనుకున్నా: పవన్ కల్యాణ్

Pawan Kalyan paid final respects to RamojiRao

  • రామోజీరావు పార్థివదేహానికి నివాళులర్పించిన పవన్ కల్యాణ్
  • రామోజీరావు మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్న జనసేనాని
  • ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలబడ్డారన్న పవన్ కల్యాణ్

తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చి రామోజీరావును కలవాలనుకున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మీడియా దిగ్గజం రామోజీరావు పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. శనివారం ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న జనసేనాని... రామోజీరావు పార్థివదేహం వద్ద పూలమాల ఉంచి నమస్కరించారు. జనసేనానితో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబు నివాళులర్పించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రామోజీరావు మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని నిలబడి ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు. తెలుగు మీడియాలో పని చేస్తోన్న వేలాదిమంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చినవారే అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించడం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఈనాడు సంస్థల ఉద్యోగులకు సానుభూతి తెలిపారు.

  • Loading...

More Telugu News