Stock Market: ఫలితాల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Results Effect On Stock Markets

  • 2 వేల పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్
  • సెన్సెక్స్ 30 సూచీలన్నీ నష్టాల్లోనే..
  • 846 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

లోక్ సభ ఫలితాలు వెలువడుతున్న వేళ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 30 సూచీలోని షేర్లన్నీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 2 వేల పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 846 పాయింట్లు కోల్పోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సోమవారం సరికొత్త రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. నేడు ఫలితాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ కొనసాగుతున్నా నష్టాలు చవిచూస్తున్నాయి. ఉదయం 9:36 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 2,134 పాయింట్లు క్షీణించి 74,334 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 846 పాయింట్లు క్షీణించి 22,417 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.24 వద్ద ప్రారంభమైంది.

Stock Market
BSE Sensex
Nifty
Loses
  • Loading...

More Telugu News