KCR: ఎగ్జిట్ పోల్స్ పై తొలిసారిగా స్పందించిన కేసీఆర్

KCR responds on exit polls

  • దేశంలో నిన్న ముగిసిన ఏడో దశ పోలింగ్
  • విడుదలైన ఎగ్జిట్ పోల్స్
  • ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్న కేసీఆర్
  • ఎక్కువ వస్తే పొంగిపోయేది లేదు, తక్కువ వస్తే కుంగిపోయేది లేదని వెల్లడి

సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ నిన్న ముగియగా, సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలపైనా ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. దీనిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. 

ఈ ఎగ్జిట్ పోల్స్ వ్యవహారం అంతా గోల్ మాల్ అని కొట్టిపారేశారు. ఒకడు మనకు 11 సీట్లు వస్తాయన్నాడు, ఇంకొకడు ఇంకో సంఖ్య చెబుతాడు... దీనిపై మళ్లీ కోట్లల్లో బెట్టింగులు... అంటూ వ్యాఖ్యానించారు. 

ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కచ్చితంగా మెరుగైన ఫలితాలే వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన బస్సు యాత్రకు విశేషంగా ప్రజాస్పందన వచ్చిందని, దాన్ని బట్టి తమకు మంచి ఫలితాలే రావాలని అన్నారు. 

"ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం... ఎన్ని వచ్చినా బాధ లేదు... 11 సీట్లు వస్తే పొంగిపోయేది లేదు, రెండో మూడో వస్తే కుంగిపోయేది లేదు. ఎది ఎలా ఉన్నా తెలంగాణకు రక్షణ కవచం అంటే అది బీఆర్ఎస్ పార్టీనే. రాజకీయ ఫలితాలు వస్తుంటాయి, పోతుంటాయి... ఈ పార్లమెంటు ఎన్నికలు కూడా అంతే" అంటూ కేసీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News