Hema: ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు... హేమ కూడా పాల్గొన్నారు: బెంగళూరు పోలీస్ కమిషనర్

Bengaluru police said Hema has attended rave party in Bengaluru

  • బెంగళూరులో రేవ్ పార్టీని భగ్నం చేసిన పోలీసులు
  • తాను ఆ పార్టీలో పాల్గొనలేదంటూ నిన్న బుకాయించిన హేమ
  • సొంత ఫాంహౌస్ లో ఉన్నానని నమ్మించే ప్రయత్నం!
  • హేమ కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్టు వెల్లడించిన బెంగళూరు సీపీ దయానంద్ 

బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేయడం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ మీడియాకు తెలియజేశారు. ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అని వెల్లడించారు. 

ఈ రేవ్ పార్టీకి 'సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ' అని పేరుపెట్టారని తెలిపారు. ఈ పార్టీలో వంద మంది పాల్గొన్నారని, వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. అయితే, తాను ఈ పార్టీలో పాల్గొనలేదని, సొంత ఫాంహౌస్ లోనే ఉన్నానంటూ హేమ విడుదల చేసిన వీడియో ఎక్కడ రికార్డ్ చేశారన్నదానిపై విచారణ జరుపుతున్నామని సీపీ వివరించారు. 

ఈ పార్టీలో పాల్గొన్నవారిలో ఐదుగురిని అరెస్ట్ చేశామని, ఇందులో ప్రజాప్రతినిధులు ఎవరూ పాల్గొనలేదని వెల్లడించారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలోని ఓ ఫాంహౌస్ లో నిర్వహించిన ఈ రేవ్ పార్టీలో అత్యధికంగా తెలుగు బుల్లితెర నటులు, మోడళ్లు పాల్గొన్నట్టు గుర్తించారు. ఈ రేవ్ పార్టీని ఓ వ్యాపారవేత్త ఏర్పాటు  చేశారు.

  • Loading...

More Telugu News