Harish Rao: సన్నవడ్లకే రూ.500 బోనస్... తీవ్రంగా స్పందించిన హరీశ్ రావు

Harish Rao fires at rs 500 bonus for rice

  • 90 శాతం రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారన్న హరీశ్ రావు
  • 10 శాతం సన్న వడ్లకే బోనస్ ఇస్తే ఎలాగని ప్రశ్న
  • సన్న వడ్లకు మార్కెట్లో ధర ఉంటుందని.. దొడ్డు రకానికే ఉండదని గుర్తించాలని సూచన
  • అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్

సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ ఈరోజు నిర్ణయించింది. ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రైతులు తాము పండించిన పంటను అమ్మకానికి సిద్ధపడి బోనస్ కోసం ఎదురు చూస్తున్నారని... కానీ వారందరి ఆశలు అడియాసలు చేస్తూ కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని.. అది కూడా వచ్చే సీజన్ నుంచి ఇస్తామని ప్రకటించడం అత్యంత బాధాకరమన్నారు. మన రాష్ట్రంలో దాదాపు 90 శాతం దొడ్డు రకం వడ్లనే పండిస్తారని... 10 శాతం పండే సన్న వడ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని తెలిపారు.

సన్న వడ్లకు మద్దతు ధర కంటే చాలా అధికంగా మార్కెట్‌లో ధర వస్తుందన్నారు. కానీ, దొడ్డు రకం బియ్యానికే గిట్టుబాటు ధర రాదని పేర్కొన్నారు. అందుకే బోనస్ ఇవ్వాల్సింది దొడ్డు రకం వడ్లకే అన్నారు. కానీ సన్నరకం వడ్లకు... అదీ వచ్చే సీజన్ నుంచి ఇస్తామని చెప్పడం రైతులను దగా చేయడమే అన్నారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులు చేసిన ప్రకటనతో... కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల సంక్షేమంపై, వ్యవసాయాభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్నారు. ఈ సీజన్ నుంచే అన్ని రకాల వడ్లకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

కాంగ్రెస్ బోనస్‌ పెద్ద బోగస్ అని విమర్శించారు. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, తాము ఆ మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో పచ్చి అబద్ధాలతో రైతులను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో ఇచ్చినవే తప్ప రైతుల మేలు కోసం చేసే కార్యక్రమాలు కావని తేలిపోయిందన్నారు. అలాగే రైతు భరోసా రూ.15 వేలు, కూలీలకు రూ.12వేల చొప్పున ఆర్థిక సాయం అమలు చేయడం లేదన్నారు.

  • Loading...

More Telugu News