AAP MP Swathi: కేజ్రీవాల్ వ్యక్తిగత సహచరుడు నాపై దాడి చేశాడు: ఎంపీ స్వాతి

Kejriwal aid misbehaved with me say MP Swathi

  • ఆప్ లో కలకలం రేపుతున్న స్వాతిపై దాడి ఘటన
  • కేజ్రీవాల్ వ్యక్తిగత సహచరుడు వైభవ్ అనుచితంగా వ్యవహరించిన వైనం
  • దురదృష్ట ఘటన అన్న ఆప్ నేత సంజయ్ సింగ్  

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి జరిగిన ఘటనపై ఆప్ రాజ్యసభ సభ్యురాలు, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ స్పందించారు. కేజ్రీవాల్ వ్యక్తిగత సహచరుడు వైభవ్ కుమార్ తన పట్ల అనుచితంగా స్పందించారని ఆమె తెలిపారు. ఈ ఘటన ఆపట్ల కేజ్రీవాల్ సానుకూలంగా స్పందించారని...  ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారని వెల్లడించారు. 

ఇదే ఘటనపై ఆప్ నేత సంజయ్ సింగ్ స్పందిస్తూ... ఇదొక దురదృష్టకర ఘటన అని చెప్పారు. కేజ్రీవాల్ నివాసంలోని డ్రాయింగ్ హాల్ దగ్గర స్వాతి వేచి ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని తెలిపారు. విప్లవ్ అనుచితంగా వ్యవహరించినట్టు తాము గుర్తించామని... దీనిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

  • Loading...

More Telugu News