Asaduddin Owaisi: పూజారి ఆశీర్వాదం తీసుకున్న మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్

Asaduddin takes blessings of hindu pujari

  • మూసారాంబాగ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అసదుద్దీన్
  • పర్యటనలో భాగంగా ఆంజనేయస్వామి ఆలయం పక్క నుంచి వెళ్లిన అసదుద్దీన్
  • ఎంపీకి ఆశీర్వాదం ఇవ్వాలని కోరిన మజ్లిస్ కార్యకర్తలు

హైదరాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారంలో భాగంగా పూజారుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈరోజు ఆయన మూసారాంబాగ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా హనుమాన్ గుడి పక్క నుంచి వెళుతున్నారు. 

ఆ సమయంలో అక్కడే ఉన్న మజ్లిస్ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ అధినేతను ఆశీర్వదించాలని హనుమంతుడి గుడి పూజారులను కోరారు. అసదుద్దీన్ కూడా పూజారి ఆశీర్వాదం కోసం ముందుకు వచ్చారు. పూజారి అసదుద్దీన్ మెడలో పూలమాల వేసి, శాలువా కప్పి సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం అర్చకులతో కలిసి అసదుద్దీన్ ఫొటో దిగారు. ఇటీవల అసదుద్దీన్ ఎన్నికల ప్రచారంలో ముగ్గురు పురోహితులు పాల్గొన్నారు.

Asaduddin Owaisi
MIM
Lok Sabha Polls
BJP
  • Loading...

More Telugu News