Narendra Modi: చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో కలిసి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం... షెడ్యూల్ ఇదిగో!

PM Modi attends election campaign with Chandrababu and Pawan Kalyan

  • ఈ నెల 6, 8 తేదీల్లో ఏపీలో మోదీ పర్యటన
  • బీజేపీ ఎంపీలు పోటీ చేస్తున్న లోక్ సభ స్థానాల పరిధిలో ప్రధాని సభలు
  • మోదీతో పాటు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఇవాళ కూటమి నేతలు లంకా దినకర్ (బీజేపీ), అశోక్ బాబు (టీడీపీ),  గౌతమ్ (జనసేన) విజయవాడ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ వివరించారు.

మే 6వ తేదీ

  • ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం చేరిక
  • మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని వేమగిరి వద్ద 16వ నెంబరు జాతీయ రహదారికి సమీపంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు
  • ఈ సభకు రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు
  • అనంతరం సాయంత్రం 5.45 గంటలకు ప్రధాని మోదీ విశాఖ ఎయిర్ పోర్టుకు చేరిక
  • సాయంత్రం 5.55 గంటలకు అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో బహిరంగ  సభకు హాజరు
  • ఈ సభకు అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరు

మే 8వ తేదీ

  • ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరిక
  • అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కలికిరి వద్ద మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభకు హాజరు
  • రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఈ సభకు హాజరు
  • సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరిక
  • సాయంత్రం 5 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ లతో కలిసి మోదీ రోడ్ షో




  • Loading...

More Telugu News