Karnataka: కర్ణాటకలో ప్రచారం కోసం బెంగళూరుకు చేరుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy will campaign in Karantaka

  • బెంగళూరులోని సర్వజ్ఞనగర్‌లో రోడ్డు షో నిర్వహించనున్న రేవంత్ రెడ్డి
  • ఆ తర్వాత మార్తనహళ్లిలోని బహిరంగ సభలో పాల్గొననున్న తెలంగాణ సీఎం
  • అనంతరం హోంగసాండ్ర కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటకలో ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం శనివారం సాయంత్రం బెంగళూరుకు చేరుకున్నారు. ఆయన బెంగళూరులోని సర్వజ్ఞనగర్‌లో రోడ్డు షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత మార్తనహళ్లిలోని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హోంగసాండ్ర కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంతకుముందు మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు తరఫున ప్రచారం నిర్వహించారు.

Karnataka
Revanth Reddy
Bengaluru
Lok Sabha Polls
  • Loading...

More Telugu News