KTR: హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేది కాళేశ్వరం ప్రాజెక్టు: కేటీఆర్

Kaleshwaram Project to the rescue of Hyderabad Citizens

  • హైదరాబాద్ ప్రజలను కాపాడేది కాళేశ్వరం ప్రాజెక్టేనని వెల్లడి
  • ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారన్న మాజీ మంత్రి
  • తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఇది పెద్ద వరమనేది వాస్తవమని వ్యాఖ్య

కాళేశ్వరం ప్రాజెక్టు హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ప్రజలను కాపాడేది కాళేశ్వరం ప్రాజెక్టే అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నప్పటికీ... తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఇది పెద్ద వరమనేది వాస్తవం అన్నారు. ఈ మేరకు 'ది న్యూఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను కేటీఆర్ జత చేశారు. మల్లన్న సాగర్ 100 ఎంఎల్‌డీ నీరు త్వరలో హైదరాబాదీయుల దాహార్తిని తీర్చనుందనేది ఆ వార్త సారాంశం. దీనిని కేటీఆర్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News