Revanth Reddy: ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy reach Delhi today

  • రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం
  • ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి
  • నేటి సాయంత్రం పార్టీకి చెందిన పలువురు నేతలతో సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఇప్పటికే దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉంది. ఆయన ఈ రోజు ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న ముంబైలోని భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు.

https://twitter.com/jitendradehade/status/1769618127107551507
  • Loading...

More Telugu News