Narendra Modi: ప్రజాగళం సభ అనంతరం ప్రధాని మోదీతో మాట్లాడిన చంద్రబాబు, పవన్

Chandrababu and Pawan Kalyan talks to PM Modi after Praja Galam rally at Boppudi

  • ముగిసిన ప్రజాగళం సభ
  • ప్రజాగళం సభ పట్ల హర్షం వ్యక్తం చేసిన మోదీ
  • ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించబోతోందని ధీమా
  • ఏపీలో పరిస్థితులను మోదీకి వివరించిన చంద్రబాబు, పవన్

పల్నాడు జిల్లా బొప్పూడి వద్ద ఎన్డీయే కూటమి నిర్వహించిన ప్రజాగళం సభ ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్రమోదీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజాగళం సభ పట్ల హర్షం వ్యక్తం చేశారు. సభ బాగా జరిగిందని, ప్రజల్లో ఉత్సాహం కనిపించిందని వారితో చెప్పారు. ఎన్డీయే కూటమి ఘనవిజయం అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, చంద్రబాబు అరెస్ట్, ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. ఇక, ఏపీలో రాజకీయ పరిస్థితులను ప్రధానికి చంద్రబాబు, పవన్ వివరించారు. ఏపీలో వ్యవస్థల విధ్వంసం జరుగుతోందంటూ పలు అంశాలను మోదీ ఎదుట ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News