Nara Bhuvaneswari: కుప్పం నుంచి చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా...?: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari makes fun in Kuppam meeting

  • కుప్పంలో నిజం గెలవాలి యాత్ర
  • ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ అంశంపై కుప్పం మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి
  • నాకు మద్దతిస్తారా? లేక, చంద్రబాబుకు మద్దతిస్తారా? అంటూ సభికులకు సరదా ప్రశ్న 

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నిజం గెలవాలి కార్యక్రమం చేపట్టారు. 'ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ’ అంశంపై కుప్పం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

కుప్పంలో నాకు మద్దతిస్తారా...? చంద్రబాబు గారికి మద్దతిస్తారా...? అంటూ సభికులను సరదాగా ప్రశ్నించారు. చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు... ఈసారి నన్ను గెలిపిస్తారా...? అని అడిగారు. దాంతో, ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్లు ఇద్దరూ కావాలంటూ జవాబిచ్చారు.

 అలా కుదరదు... ఎవరో ఒకరి పేరే చెప్పాలంటూ నారా భువనేశ్వరి కోరారు. అయితే, ఇది తాను సరదాగానే అంటున్నానని చెప్పారు . ప్రస్తుతం తాను చాలా హ్యాపీగా ఉన్నానని... రాజకీయాలకు తాను దూరంగా ఉంటానంటూ భువనేశ్వరి స్పష్టం చేశారు. 

ఎప్పుడూ సీరియస్ చర్చలే కాదు... అప్పడప్పుడు సరదాగా మాట్లాడుకోవాలని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News