AP Cabinet: సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదం

AP Cabinet approves key points

  • ఓటాన్ అకౌంట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్
  • డోన్ లో రెండు పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం
  • రాష్ట్రంలో మూడు ప్రైవేట్ యూనివర్శిటీలకు గ్రీన్ సిగ్నల్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశమయింది. ఈ భేటీకి మంత్రులంతా హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. 

కేబినెట్ నిర్ణయాలు:
  • 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ ను ఆమోదించిన కేబినెట్.
  • నంద్యాల జిల్లా డోన్ లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజి ఏర్పాటుకు ఆమోదం. వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్శిటీ కింద పని చేయనున్న పాలిటెక్నిక్ కాలేజీ. 
  • డోన్ లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కాలేజీ ద్వారా వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమో కోర్సు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ కింద పని చేయనున్న కాలేజీ. 
  • అన్నమయ్య జిల్లాలో అన్నమాచార్య యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. 
  • ఏపీ ప్రైవేట్ యూనివర్శిటీస్ యాక్ట్ 2016కి సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో ఈ మూడు యూనివర్శిటీల ఏర్పాటుకు అనుమతి.  
  • శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన కేబినెట్.

  • Loading...

More Telugu News