Stock Market: కేంద్ర బడ్జెట్ రోజున తీవ్ర ఒడిదుడుకులకు గురైన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses on budget day

  • 106 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 28 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • నాలుగున్నర శాతం వరకు లాభపడ్డ మారుతి షేర్ల విలువ

లోక్ సభ ఎన్నికలకు ముందు ఈరోజున కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఓ వైపు లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతుంటే... మరోవైపు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత సూచీలు పూర్తిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 71,645కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 21,697 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (4.40%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.49%), యాక్సిస్ బ్యాంక్ (1.57%), ఎన్టీపీసీ (1.32%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.12%). 

టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-2.38%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.26%), జేఎస్ డబ్ల్యూ (-2.03%), టైటాన్ (-1.93%), బజాజ్ ఫైనాన్స్ (-1.75%).  

మరోవైపు అమెరికా డాలరుతో పోలిస్తే ఇండియన్ కరెన్సీ ఈరోజు 6 పైసల మేర బలపడింది. యూఎస్ కరెన్సీతో పోలిస్తే మన రూపాయి విలువ రూ. 82.98గా ఉంది.

Stock Market
Sensex
Nifty
  • Loading...

More Telugu News