Vijayasai Reddy: టీడీపీ ఇప్పుడు 'టి.డి.పి' సమస్యను ఎదుర్కొంటోంది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy says TDP now facing Twin Deficit Problem

  • టీడీపీ పతనం స్పష్టంగా తెలుస్తోందన్న విజయసాయి
  • ఫిబ్రవరి తర్వాత రాజ్యసభలో టీడీపీకి ఒక్క ఎంపీ కూడా ఉండరని వెల్లడి
  • లోక్ సభ ఎన్నికల్లోనూ అదే ఫలితం వస్తుందని ట్వీట్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విపక్ష టీడీపీపై మరోసారి ధ్వజమెత్తారు. టీడీపీ పతనం స్పష్టంగా తెలుస్తోందని ట్వీట్ చేశారు. "ఈ ఫిబ్రవరి తర్వాత రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం సున్నా. ఆ తర్వాత లోక్ సభలోనూ సున్నా. చరిత్రలో తొలిసారిగా టీడీపీకి ఉభయ సభల్లో ఒక్క ఎంపీ కూడా మిగలరు. టీడీపీ ఇప్పుడు టి.డి.పి (ట్విన్ డెఫిసిట్ ప్రాబ్లం) సమస్యను ఎదుర్కొంటోంది. టీడీపీ నాయకత్వ లోటు, విశ్వసనీయత లోటుతో బాధపడుతోంది" అని విజయసాయిరెడ్డి వివరించారు.

  • Loading...

More Telugu News