Revanth Reddy: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన షర్మిలకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

Revanth Reddy Congratulates Sharmila for appointed as APPCC chief

  • వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కోసం దావోస్‌లో ఉన్న రేవంత్ రెడ్డి
  • షర్మిలకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్
  • ఈ రోజే ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కోసం ఆయన దావోస్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన షర్మిలకు గ్రీటింగ్స్ చెబుతూ ట్వీట్ చేశారు. 'ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన షర్మిల గారికి శుభాకాంక్షలు.. ఆల్ ది వెరీ బెస్ట్' అంటూ ట్వీట్ చేశారు.

ఏపీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజును సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. షర్మిలకు పగ్గాలు అప్పగిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.

  • Loading...

More Telugu News