Rajeev Chandrasekhar: రైల్లో ఎదురుపడ్డ బాలుడికి లాప్‌టాప్ గిఫ్ట్ ఇచ్చిన కేంద్ర మంత్రి

Union Minister gifts laptop to Kerala boy he met during train journey

  • రైల్లో మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌కు తారసపడ్డ కేరళ చిన్నారి
  • తాను రూపొందించిన వీడియోలు మంత్రికి చూపించిన బాలుడు
  • చిన్నారికి ఓ కొత్త లాప్‌టాప్ బహుమతిగా ఇస్తానన్న మంత్రి
  • ఇచ్చిన మాటను నిలబెట్టుకుంలూ గురువారం బాలుడికి బహుమతి అందజేత

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓ బాలుడికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చిన్నారికి ఓ లాప్‌టాప్ గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ‘‘త్రిస్సూర్ నుంచి కోజీకోడ్‌కు వెళుతుండగా రైల్లో తొమ్మిదేళ్ల బాలుడు శ్రీరామ్ తారసపడ్డాడు. తాను రూపొందించిన పలు సృజనాత్మక వీడియోలను నాకు సంబరపడుతూ చూపించాడు. అప్పుడు నేను అతడికి కొత్త లాప్‌టాప్ బహుమతిగా ఇస్తానని మాటిచ్చా. ఈ రోజు కాస్తంత ముందుగానే న్యూ ఇయర్ బహుమతి కింద అతడికి కొత్త లాప్‌టాప్ ఇచ్చా’’ అని మంత్రి పేర్కొన్నారు. బాలుడికి, అతడి కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి చిన్నారి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News