Chandrababu: యువగళం విజయోత్సవ సభకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

Chandrababu and Pawan Kalyan to attend Yuvagalam vijayotsava sabha

  • నేటితో ముగియనున్న యువగళం పాదయాత్ర
  • ఈ నెల 20న విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం విజయోత్సవ సభ
  • ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న టీడీపీ, జనసేన

టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది. విశాఖలోని ఆగనంపూడి వద్ద పాదయాత్ర ముగియబోతోంది. మరోవైపు ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ సభ నుంచే టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి. ఇరువురు నేతలు ఆ రోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సభకు ఇరు పార్టీలకు సంబంధించి లక్షలాది మంది తరలిరానున్నారు. ఇప్పటికే 7 ప్రత్యేక రైళ్లను టీడీపీ ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News