Nara Lokesh: ఈ నెల 20న లోకేశ్ యువగళం ముగింపు సభ... ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన టీడీపీ

Special Trains for Nara Lokesh Yuvagalam victory rally

  • జనవరి 27 నుంచి కొనసాగుతున్న లోకేశ్ యువగళం
  • ప్రస్తుతం ఉత్తరాంధ్రలో కొనసాగుతున్న పాదయాత్ర
  • మరి కొన్ని రోజుల్లో ముగింపు
  • భోగాపురం సమీపంలోని పోలేపల్లి వద్ద విజయోత్సవ సభ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరి కొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో, యువగళం విజయోత్సవ సభను డిసెంబరు 20న భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వస్తుండడంతో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. 

పొత్తు అనంతరం చంద్రబాబు, పవన్, లోకేశ్, నందమూరి బాలకృష్ణ ఒకే వేదిక మీదికి వస్తుండడంతో ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు డిసెంబరు 19న తిరుపతి, రైల్వే కోడూరు, మాచర్ల, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఆదోని నుంచి బయల్దేరి విజయనగరం చేరుకుంటాయి. 

అంతేకాదు, ఆర్టీసీ నుంచి అద్దె బస్సులు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆర్టీసీ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.

  • Loading...

More Telugu News