Revanth Reddy: నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy gives Rs2 crores to Nikhat Jareen

  • రెండు గ్యారంటీలు ప్రారంభించిన సమయంలో రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందజేత
  • గత మార్చిలో మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 50 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన జరీన్
  • ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలలో ఆమెకు ఇది రెండో పతకం 

బాక్సర్ నిఖత్ జరీన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈ రోజు రెండు పథకాలను అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించారు. చేయూత, మహాలక్ష్మి పథకాలను లాంచ్ చేశారు. ఈ సమయంలోనే జరీన్‌కు ఆర్థిక సాయం అందించారు. గత మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో 50 కిలోల విభాగంలో జరీన్ స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలలో ఆమెకు ఇది రెండో బంగారు పతకం.

  • Loading...

More Telugu News