KTR: ప్రజా దర్బార్ పై కేటీఆర్ వ్యాఖ్యలు వైరల్

KTR comments on Praja Darbar going viral

  • నిన్న ప్రజాదర్బార్ నిర్వహించిన రేవంత్ రెడ్డి
  • పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు
  • గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వైరల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి, ముఖ్యమంత్రికి తమ వినతిపత్రాలను అందించారు. అయితే, అధికారిక కార్యక్రమాల కారణంగా ముఖ్యమంత్రి త్వరగా ప్రజాభవన్ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు తమ హయాంలో ప్రజాదర్బార్ ను ఎందుకు నిర్వహించడంలేదో గతంలో మంత్రి కేటీఆర్ వివరించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News