TS Assembly: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ... కొనసాగుతున్న ప్రమాణస్వీకారాలు

TS Assembly started

  • కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలి అసెంబ్లీ సమావేశాలు
  • ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ
  • అనారోగ్య కారణాలతో అసెంబ్లీకి రాని రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తొలి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు అక్షర క్రమంలో ప్రమాణం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్య కారణాలతో అసెంబ్లీకి హాజరుకాలేదు. మాజీ మంత్రి కేటీఆర్ తన తండ్రి వద్దనే ఉండటం కారణంగా ఆయన కూడా అసెంబ్లీకి రాలేదు.

  • Loading...

More Telugu News