BRS: సాయంత్రం గం.5 లోపు పోలింగ్ కేంద్రంలో ఉంటేనే ఓటు వేసే అవకాశం!

Voting will not be allowed after 5 clock

  • రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్
  • సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చి క్యూలో నిలబడితే ఓటు వేయవచ్చు
  • ఐదు గంటల తర్వాత పోలింగ్ కేంద్రానికి వస్తే ఓటు వేయడానికి అవకాశం ఉండదు

తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ప్రయాణం బడలిక వంటి కారణాల వల్ల పోలింగ్ బూత్‌కు రావడం ఆలస్యం కావొచ్చు. ఈ పరిస్థితుల్లో ఏ సమయం వరకు పోలింగ్ బూత్‌లో ఉంటే ఓటు వేయొచ్చో తెలుసా?

ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చే ఓటర్లను అధికారులు లోపలికి అనుమతించరు. కానీ సాయంత్రం ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రం దగ్గర వరుసలో/క్యూలో నిలుచుకుంటే మాత్రం ఓటు వేసేందుకు అనుమతిస్తారు. కనుక ఎన్నికల నియమావళి ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటే ఓటు వేయవచ్చు. క్యూ ఎంత పొడవు ఉన్నా మీకు ఓటు వేసే అవకాశం ఇస్తారు. కానీ ఐదు దాటిన తర్వాత పోలింగ్ కేంద్రానికి వస్తే అవకాశం ఉండదు.

BRS
BJP
Telangana Assembly Election
Congress
  • Loading...

More Telugu News