Manda Krishna Madiga: బీజేపీలో చేరిన మంద కృష్ణ సోదరుడు

Manda Krishna Madiga brother joins BJP

  • హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరిన మంద కృష్ణ సోదరుడు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఈటల రాజేందర్
  • మాదిగల సమస్యను మోదీ గుర్తించి పరిష్కరిస్తున్నందునే బీజేపీలో చేరినట్లు ఈటల వెల్లడి

మంద కృష్ణ మాదిగ సోదరుడు మంద కార్నెల్ శనివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో ఆయన కమలం పార్టీలో చేరారు. ఆయనకు ఈటల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... 30 ఏళ్లుగా జాతి పడుతున్న బాధను ప్రధాని నరేంద్రమోదీ అర్థం చేసుకొని, సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని గుర్తించి, బీజేపీ కండువాను కప్పుకోవడానికి ఆయన వరంగల్ నుంచి గజ్వేల్‌‌కి వచ్చారని తెలిపారు. కార్నెల్‌కు పార్టీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News